Gandhi Statue : మూసీ ప్రాజెక్టులో భాగంగా రూ.5,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన గాంధీ విగ్రహం (Gandhi Statue) నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భూ సేకరణపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో గత్యంతరం లేక రేవంత్ సర్కార్ తోకముడిచింది. రేపు బండ్లగుడా జాగిర్ వార్డ్ ఆఫీసులో జరగాల్సిన భూసేకరణ సమావేశాన్ని వాయిదా పడింది. అయితే.. ప్రజాగ్రహం దృష్ట్యా తాత్కాలికంగానే భూ సేకరణను ప్రభుత్వం వాయిదా వేసినట్టు సమాచారం.
బ్రేకింగ్ న్యూస్
తీవ్ర ప్రజా వ్యతిరేకత రావడంతో మూసీ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించ తలపెట్టిన గాంధీ విగ్రహం కోసం భూసేకరణ విషయంలో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన రేవంత్ ప్రభుత్వం.
రేపు బండ్లగుడా జాగిర్ వార్డ్ ఆఫీసులో జరగాల్సిన భూసేకరణ సమావేశం తాత్కాలికంగా వాయిదా. https://t.co/IGlkjeIiRG
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2026