బన్సీలాల్పేట్, మే 14: గాంధీ మెడికల్ కళాశాల అలూమ్ని అసోసియేషన్ తరఫున గాంధీ దవాఖానకు రూ.30 లక్షల అత్యవసర వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు. శుక్రవారం అలూమ్ని హాలులో జరిగిన కార్యక్రమంలో గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుకు.. అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ జీఆర్ లింగమూర్తి, ఉపాధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ వాటిని అందజేశారు. గ్లోబల్ అలయెన్స్ 2కే బ్యాచ్ ఆర్థిక సహాయంతో 15 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 6 బీప్యాప్ మెసీన్లు, 7 వేల ఎన్95 మాస్కులు, వెయ్యి పీపీఈ కిట్లు అందజేశారు. అలాగే.. డాక్టర్ సాయిబాబా, సాయిజ్యోతి ఐ హాస్పిటల్, దేవ్నార్ ఫౌండేషన్ల సహకారంతో రూ.లక్ష వ్యయంతో ఈసీజీ యంత్రాలు, ఎన్95 మాస్కులు, డాక్టర్ రమ తరఫున 25 పల్స్ ఆక్సీమీటర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శోభన్బాబు, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్రెడ్డి, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మణికిరణ్, కార్తీక్, సాయిరోహిత్, వంశీ, లోహిత్రెడ్డి పాల్గొన్నారు.