బన్సీలాల్పేట్, సెప్టెంబర్ 14 : గాంధీ మెడికల్ కళాశాల 67వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మంగళవారం ఆలుమ్ని హాలులో ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డీఎంఈ డాక్టర్ కె.రమేశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ మెడికల్ కళాశాల నిబద్ధత కలిగిన వేలాదిమంది డాక్టర్లను తయారు చేసిందని అన్నారు. ప్రపంచంలో 600 ఐసీయూ పడకలు కలిగిన ఏకైక దవాఖాన గాంధీ ఆస్పత్రి అని కొనియాడారు. కరోనా కాలంలో 24 గంటలూ శ్రమించి వేలాది మందికి పునర్జన్మను ప్రసాదించించిన వైద్యుల సేవలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ప్రకాశ్రావు, సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, అలుమ్ని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాజిరెడ్డి, డాక్టర్ లింగయ్య, ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ ప్రతాప్రెడ్డి, డాక్టర్ లింగమూర్తి, బాలనర్సింహ, బాల్రాజు, బాలకృష్ణారెడ్డి, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్లో ప్రతిభ కనబర్చిన 20 మంది విద్యార్థులకు అవార్డులు, ఉపకార వేతనాలను ప్రదానం చేశారు.