సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఆదివారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ సందర్శించారు. స్వామివారిని కొలిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అధికారులు, పూజారులు మేయర్కు ఘనస్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేశారు. అనంతరం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదాద్రి ఆలయం ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. లక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దితున్న సీఎం కేసీఆర్కు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు.