బంజారాహిల్స్, జూలై 10 : హరితహారంలో మహిళలు మరింత చురుకుగా పాల్గొనాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. బంజారాహిల్స్ డివిజన్లోని ఎన్బీటీనగర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో ఆరు మొక్కలు నాటేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం బంజారాహిల్స్ రోడ్ నం. 11లోని లేక్వ్యూ బంజారా ఫంక్షన్హాల్ వద్ద జీహెచ్ఎంసీ పార్కులో హరితహారం ఏర్పాట్లను పరిశీలించారు. జూలై 24న మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలంతా పాల్గొనాలని సూచించారు.
‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి కార్పొరేటర్ పి.విజయారెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.వాణి తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిలో భాగంగా రహ్మత్నగర్ డివిజన్లో వ్యర్థాల తొలగింపు చేపట్టారు. బస్తీల్లో పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను తొలగించడంతో పాటు డంపింగ్ యార్డ్కు తరలించారు. కార్పొరేటర్ సీఎన్. రెడ్డి శనివారం వ్యర్థాల తొలగింపును పరిశీలించారు.
శ్రీనగర్కాలనీ, జూలై 10 : ప్రజలందరి భాగస్వామ్యంతో పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి అన్నారు. శనివారం డివిజన్లోని పంజగుట్ట ఉప్పర్బస్తీలో పట్టణ ప్రగతిలో భాగంగా వ్యర్థాలను తొలగించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పది రోజుల పాటు జీహెచ్ఎంసీ నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమం పారిశుధ్య సిబ్బంది సేవలు, ప్రజల సహకారం, అధికారుల ప్రోత్సాహంతో విజయవంతమైందన్నారు. కార్యక్రమంలో ఏఈ ఆనంద్, రవి, అనిల్, శ్రీనివాస్, టీఆర్ఎస్ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ, జూలై 10 : ‘పట్టణ ప్రగతి’లో భాగంగా శనివారం అధికారులు వెంగళరావునగర్ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా మధురానగర్, కల్యాణ్నగర్, రహ్మత్నగర్, జవహర్నగర్, యాదగిరినగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు, వీధుల్లో పేరుకుపోయిన చెత్త, ఇసుకను తొలగించేశారు. బల్దియా డిప్యూటీ కమిషనర్ రమేశ్ పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో అధికారులు రాజ్కుమార్, విజయ్కుమార్, కార్పొరేటర్ దేదీప్య, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
అమీర్పేట్, జూలై 10 : సనత్నగర్ డివిజన్ మోడల్కాలనీలో ‘పట్టణ ప్రగతి’లో భాగంగా దీర్ఘకాలంగా కాలనీ రోడ్లపై పేరుకుపోయిన చెత్త, డెబ్రిస్, చెట్ల కొమ్మలను శనివారం తొలగించారు. ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జేఎస్టీ సాయి మాట్లాడుతూ.. రోడ్లపై తొలగించిన చెత్త, డెబ్రిస్, చెట్ల కొమ్మలతో కాలనీ రోడ్లు శుభ్రంగా మారాయన్నారు.