సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): పారిశుధ్య సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్లను భాగస్వామ్యం చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపుతున్నారు. బుధవారం రాజేంద్రనగర్ నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులతో మేయర్ సమీక్ష జరిపారు. ఓరా చెరువు, శివరాంపల్లి, అప్పా చెరువులతో పొంచి ఉన్న ప్రమాదం.. దోమలు, పారిశుధ్య సమస్యలను కార్పొరేటర్లు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎస్ఎఫ్ఏ నుంచి పారిశుద్ధ్య కార్మికుల హాజరును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని మేయర్ కార్పొరేటర్లను కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, జోనల్ కమిషనర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.