హైదరాబాద్: నగరంలో గణేశ్ లడ్డూ వేలం రికార్డులు సృష్టిస్తున్నాయి. బొజ్జ గణపయ్యతోపాటు తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న లడ్డూని దక్కించుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు. అత్యంత ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశ్ లడ్డూ రూ.18 లక్షల 90 వేలు పలుకగా, గచ్చిబౌలిలో కూడా ఓ గణనాథుని మహాప్రసాదం రూ.18.5 లక్షలు పలికింది.
గచ్చిబౌలీలోని మై హోం భుజా అపార్టుమెంటులో గణేశుని లడ్డూకి వేలం పాట నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పోటాపోటీ పడ్డారు. దీంతో విజయభాస్కర్రెడ్డి అనే భక్తుడు రికార్డు స్థాయిలో రూ.18 లక్షల 50 వేలకు దక్కించుకున్నాడు. నగరంలో ఇప్పటివరకు బాలాపూర్ లడ్డూ తర్వాత నగరంలో అత్యధిక ధర పలికిన లడ్డూ ఇదే కావడం విశేషం.