ఆహ్లాదం పంచుతున్న ప్రకృతివనం
ఆదాయ వనరుగా డంపింగ్యార్డు
చివరి మజిలీ చింత తీర్చిన వైకుంఠధామం
అద్దంలా మెరుస్తున్న పల్లె రోడ్లు
నల్లబెల్లి, మే 2:నందిగామలో ప్రగతి వికసిస్తున్నది. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఈ ఊరు పల్లెప్రగతి కార్యక్రమంతో ప్రకాశిస్తున్నది. ప్రభుత్వం నెలనెలా ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. పల్లె ప్రకృతివనం ఆహ్లాదం పంచుతుండగా, డంపింగ్యార్డుతో చెత్త సమస్య, వైకుంఠధామంతో చివరి మజిలీ చింత తీరింది. జీపీ సిబ్బంది కృషితో రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి.
నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామ జనాభా 2256 కాగా, నివాస గృహాలు 650 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పల్లెప్రగతితో ఈ గ్రామ రూపురేఖలు మా రిపోయాయి. ప్రభుత్వం నెలనెలా ఇస్తున్న రూ.3లక్షల నిధులను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఖర్చు చేసి గ్రామా న్ని సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధికి చిరునామాగా మార్చేశారు. అలాగే పల్లె ప్రకృతివనం గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. 1500 మొక్కలు నాటి నిత్యం నీళ్లు పోస్తూ సంరక్షిస్తున్నారు. అధునాతనంగా నిర్మించిన డంపింగ్యార్డుతో గ్రామంలో చెత్త సమస్య తీరింది. వైకుంఠధామం నిర్మాణ పనులు కూడా పూర్తయి అందుబాటులోకి వచ్చింది. మల్టీపర్పస్ వర్కర్లు ప్రతిరోజూ గ్రామంలోని అన్ని వీధులను శుభ్రం చేస్తున్నారు. ప్రధాన రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతుండడంతో గ్రామస్తులకు స్వచ్ఛమైన గాలి లభిస్తున్నది. మిషన్ భగీరథ నీరు ఇంటింటికీ అందుతున్నది. నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో గ్రామం దేదీప్యమానంగా వెలుగొందుతున్నది.
పక్కా ప్రణాళికతోనే..
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పల్లె ప్రగతిపై ప్రత్యేక దృష్టిపెట్టాం. అటు ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనతో కిందిస్థాయి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అభివృద్ధిలో భాగస్వాములను చేశాం. పక్కా ప్రణాళికతో నిధులు ఖర్చు చేయడం వల్లే గ్రామ అభివృద్ధి సాధ్యమైంది.
గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి
గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమైంది. అధికారులు, పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల అండదండలతో ముందుకుసాగుతున్నాం. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన నిధులను ప ద్ధతి ప్రకారం ఖర్చు చేశాం. డంపింగ్యార్డుతో పాటు ఇతర వనరులను పంచాయతీకి ఆదాయ మార్గాలుగా అభివృద్ధి చేశాం.