వంద శాతం తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’ కొత్త సినిమాలు, ఒరిజినల్ సిరీస్లతో
డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది. అందరిలో ఆసక్తి పెంచిన ‘అర్ధ శతాబ్దం’ చిత్రం జూన్ 11న విడుదలకాబోతోంది. ‘ఆహా’ ఎక్స్క్లూజివ్ మూవీగా విడుదలవుతోన్న ఈ చిత్రానికి రవీంద్ పుల్లె దర్శకుడు. కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయికుమార్, కృష్ణ ప్రియ, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అంబేద్కర్ జయంతి రోజున విడుదలైన ఈ టీజర్ కు మంచి స్పందన వచ్చింది.
బుధవారం రోజున ఈ సినిమా ట్రైలర్ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. తెలంగాణలోని కుగ్రామ మూలాల్లోని రాజకీయాలకు, కుల వ్యవస్థకు మధ్య ఉండే రా ఎమోషన్స్, ఇన్టెన్స్ యాక్షన్, రస్టిక్ రొమాన్స్ వంటి పలు అంశాల కలయికగా ఈ చిత్రం రూపొందించినట్లు తెలుస్తోంది. సినిమాలోని రాజకీయ అంశాలు, డ్రామా, మానవ సంబంధాలు, సంగీతం ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ట్రైలర్ను విడుదల చేసిన సందర్భంగా నాని మాట్లాడుతూ ‘అర్ధ శతాబ్దం’ ట్రైలర్ చాలా ఎంగేజింగ్గా ఉంది. సినిమా చూడాలనే ఆసక్తి పెంచింది. ఆహాలో జూన్ 11న విడుదలవుతుంది. నటీనటులందరూ చక్కగా నటించారు. ఎంటైర్ యూనిట్కి అభినందనలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు.