జూబ్లీహిల్స్, మార్చి17 : రాష్ట్ర ప్రభుత్వం 20 వేల లీటర్లలోపు వినియోగదారులకు అందిస్తున్న ఉచిత మంచినీటి పథకానికి ఈనెల 31తో గడువు ముగియనుంది. ఈ పథకంలో భాగంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు జీరో బిల్ జారీ చేసేందుకు జలమండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బస్తీలలో స్లమ్ లెవల్ డొమెస్టిక్ (బస్తీల్లో ఉండే) వినియోగదారులతో పాటు ఇతర డొమెస్టిక్ (గృహ) వినియోగదారులకు ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నా రు. కాగా బస్తీల్లోని డొమెస్టిక్ వినియోగదారులకు ఈ పథకాన్ని వర్తింపచేసేందుకు ఎలాంటి మీటర్లు అవసరం లేకున్నా.. ఇతర డొమెస్టిక్ వినియోగదారులకు కచ్చితంగా మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాగా ఇరువర్గాల వినియోగదారులు తమ క్యాన్లను ఆధార్తో లింక్ చేసుకుంటేనే ఈ పథకం వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో స్లమ్లెవల్ డొమెస్టిక్ వినియోగదారులతో పాటు ఇతర డొమెస్టిక్ వి నియోగదారులకు జలమండలి అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా జలమండలి డివిజన్-6 జనరల్ మేనేజర్ హరిశంకర్ ఆధ్వర్యం లో డీజీఎంలు చిట్టిబాబు, రజినీకాంత్ రెడ్డితో పాటు మే నేజర్లు, ఇతర అధికారులు, సిబ్బంది బస్తీలలో ఇంటింటికీ వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
మీటర్లు అవసరం లేని డొమెస్టిక్ స్లమ్స్ వినియోగదారులు జూబ్లీహిల్స్ సెక్షన్ పరిధిలో 5248 మంది, ఎల్లారెడ్డిగూడ సెక్షన్ పరిధిలో 600 మంది, ఎర్రగడ్డ-వెంగళరావునగర్-ఎస్పీఆర్ హిల్స్ సెక్షన్ల పరిధిలో 4600 మంది ఉన్నారు. మీటర్లు అవసరం లేని వినియోగదారులందరూ తమ క్యాన్లను ఆధార్తో లింక్ చేసుకుంటేనే ఈ పథకానికి అర్హులవుతారు.
అంతేకాక మీటర్లు బిగించుకుని తమ క్యాన్లను ఆధార్తో లింక్ చేసుకోవాల్సిన డొమెస్టిక్ వినియోగదారులు జూబ్లీహిల్స్ సెక్షన్ పరిధిలో 6843 మంది, ఎల్లారెడ్డిగూడ సెక్షన్ పరిధిలో 5700 మంది, ఎర్రగడ్డ-వెంగళరావునగర్-ఎస్పీఆర్ హిల్స్ సెక్షన్ల పరిధిలో 11 వేల మంది ఉన్నారు. అన్ని వర్గాల వారికి లబ్ధిచేకూర్చే ఈ పథకాన్ని లబ్ధిదారులందరికీ వర్తింపచేసేందుకు జలమండలి అధికారులు కృషి చేస్తున్నారు.
ప్రభుత్వం నీటి వినియోగదారులకు అందిస్తున్న ఈ ఉచిత మంచినీటి పథకం వర్తించాలంటే బస్తీలలో ప్రతిఒక్కరూ తమ క్యాన్లను ఆధార్తో లింక్ చేయించుకోవాలి. డొమెస్టిక్ వినియోగదారులు సైతం మీటర్లను బిగించుకుంటేనే ఈ పథకానికి అర్హులు. మీ సేవ కేంద్రాలతో పాటు జలమండలి కార్యాలయాల్లో అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లబ్ధిదారులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. -జీఎం హరిశంకర్, జలమండలి డివిజన్-6