న్యూఢిల్లీ: కోల్కతాలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్సీఎస్ఎం) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు ఈ రోజు నుంచి వచ్చే నెల 9 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఆఫీస్ అసిస్టెంట్ 1, జూనియర్ స్టెనోగ్రాఫర్ 1, టెక్నీషియన్-ఏ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: హెచ్ఎస్సీ లేదా పదో తరగతి పాసై ఉండాలి. హిందీ, ఇంగ్లిష్లో నిర్ణీత స్పీడ్లో టైప్ చేయగలగాలి. టెక్నీషియన్ పోస్టులకు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 23 ఏండ్ల లోపు వయస్సు ఉన్నవారై ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.200
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 15
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 28
వెబ్సైట్: https//www.ncsm.gov.in/recruitment