కాచిగూడ,ఆగస్టు 29 : శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడ తుల్జాభవన్లో ఉచిత హోమియోపతి, అల్లోపతి వైద్యశిబిరాలను నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 120 మంది రోగులు పాల్గొని వివిధ రకాల వైద్య పరీక్షలను చేయించుకున్నారు. రోగులకు మందులను అందజేశా. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ.. పేదలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
ప్రజల్లో పలు రకాల వ్యాధులను రూపుమాపడానికి ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో దోహద పడుతాయన్నారు. నేటి సమాజంలో ప్రజలు మారుతున్న వాతావరణంతో పాటు ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్య పరమైన సమస్యలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రతి ఆదివారం కాచిగూడ తుల్జాభవన్లో ఉచిత హోమియోపతి, అలోపతి వైద్యశిబిరాలను నిర్వహిస్తామని శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.