శ్రీనగర్కాలనీ, ఆగస్టు 23 : ఆశ్రయ్- అకృతి కేంద్రంలో ఉచితంగా చెవి, వినికిడి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త ఎస్. మల్లికార్జున్ తెలిపారు. శ్రీనగర్కాలనీలో సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రతి రోజు ఉచితంగా పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన వారికి వినికిడి పరికరాలు అందజేస్తామని తెలిపారు. స్పీచ్ థెరఫీ, కోక్లియర్ ఇంప్లాంట్, ఆడిటరీ వెర్బల్ థెరపీ ఉచితంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబరు 91000 81148, 91007 79276లో సంప్రదించాలని ఆయన కోరారు.