బంజారాహిల్స్,మార్చి 25 : సినీ నిర్మాణం విషయంలో మోసం చేసిన వ్యక్తులపై ఓ నిర్మాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎ.ఐలయ్య అనే వ్యక్తి చిట్టి కిరణ్రామోజు అనే వ్యక్తితో కలిసి గత ఏడాది లాక్డౌన్కు ముందు సౌత్ సిల్వర్ స్క్రీన్ స్డూడియోస్ బ్యానర్పై ‘అర్ధశతాబ్దం’ పేరుతో సినిమా ప్రారంభించారు. లాక్డౌన్ సందర్భంగా షూటింగ్లు నిలిచిపోవడంతో ఐలయ్య సొంతూరికి వెళ్లిపోయాడు. అయితే కిరణ్.. కొంతమంది స్నేహితులను కలుపుకుని మిగిలిన సినిమాను షూటింగ్ పూర్తి చేసి.. రిషితశ్రీ క్రియేషన్స్ బ్యానర్పై సినిమాను తీసినట్లు నమ్మించి ‘ఆహా’ సంస్థకు అమ్ముకున్నాడు. అయితే.. ఈ విషయంలో తనను మోసం చేశాడంటూ నిర్మాత ఐలయ్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఫిల్మ్చాంబర్కు, ఆహా సంస్థకు ఫిర్యాదులు చేశామని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు.