న్యూఢిల్లీ: నూతన ఐటీ నిబంధనలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ ట్విట్టర్, ఫేస్బుక్లపై కేంద్రం నిషేధం విధిస్తుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు గతంలో మంచి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో వాడి వదిలేసిన ప్లాట్ఫామ్.. అర్కూట్కు సంబంధించి మీమ్స్ షేర్ చేస్తున్నారు.
అయితే, నూతన ట్రెండ్ల సమాచారం తెలుసుకోవడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం.. గత ఫిబ్రవరి 25వ తేదీన కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) నూతన ఐటీ నిబంధనలను నోటిఫై చేసింది.
మూడు నెలల్లో ఐటీ నిబంధనలను పాటించాలని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, కూ తదితర సోషల్ మీడియా సంస్థలను కేంద్రం కోరింది. ఒకవేళ నిబంధనలను పాటించకపోతే, భారత్లో సదరు కంపెనీల లావాదేవీలకు తక్షణం తెర పడినట్లేనని అధికార వర్గాలు తెలిపాయి.
గడువు లోగా నిబంధనలు పాటించని సోషల్ మీడియా వేదికలు క్రిమినల్ కేసుల ప్రాసిక్యూషన్ను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 25వ తేదీన గడువు ముగిసిన తర్వాత ఒకే ఒక్క కంపెనీ కేంద్రం నిబంధనల అమలుకు అధికారులను నియమించినట్లు తెలుస్తున్నది.
నూతన ఐటీ నిబంధనలను అమలు చేయడానికి సోషల్ మీడియా సంస్థలు చీఫ్ కంప్లియెన్స్ అధికారిని నోడల్ ఆఫీసర్గా నియమించాల్సి ఉంటుంది. గడువు ముగియడంతోపాటు బుధవారం నుంచి నిబంధనలు అమలులోకి వచ్చినా ఒక్క కంపెనీ నుంచి సరైన స్పందన లేదు.
దేశీయ సోషల్ మీడియా వేదిక.. కూ.. మినహా ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రకటించిన దాఖలాలు కనిపించలేదు.
ఫలితంగా నెటిజన్లు.. ట్విట్టర్, ఫేస్బుక్లను కేంద్రం నిషేధించొచ్చంటూ పోస్టులు పెడుతున్నారు. #ట్విట్టర్ బ్యాన్, #ఫేస్బుక్ బ్యాన్ అనే హ్యాష్ట్యాగ్లు ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతున్నాయి.
ఈ హ్యాష్ట్యాగ్లు పోస్ట్ చేయడంతోపాటు ట్విట్టర్ యూజర్లు ఆర్కూట్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంగతి ప్రస్తావిస్తున్నారు. 2014 సెప్టెంబర్ 30న ఇది పూర్తిగా మూతపడింది.
2000వ దశకం చివరిలో సెర్చింజన్ గూగుల్.. సొంతంగా అర్కూట్ పేరిట సోషల్ మీడియా వేదికను నిర్వహించింది. అప్పట్లో అత్యధికులు వాడిన సోషల్ మీడియా వెబ్సైట్లలో ఇది ఒకటిగా నిలిచింది.
సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ నూతన ఐటీ రూల్స్ను అమలు చేయాల్సిందేనని నిపుణులు భావిస్తున్నారు. దేశ డిజిటల్ మీడియాలో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సమగ్ర భాగం అని, తప్పించుకోవడానికి వీల్లేదని అంటున్నారు.
కొత్త ఐటీ నిబంధనలతో పౌరుల ప్రైవసీ ఉల్లంఘనే: వాట్సాప్
జగన్ బెయిల్ విచారణ జూన్ 1కి వాయిదా
Flipkart Shop From Home Days sale: ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్
మొదటి డోసు కోవిషీల్డ్.. రెండోసారి కోవాగ్జిన్
జూన్ 1 నుంచి అలిపిరి నడక మార్గం మూసివేత
యాస్తో 3 లక్షల ఇండ్లకు నష్టం : మమతా బెనర్జీ
ఉత్తరాది ఓటర్లపై డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
చిన్న పరిశ్రమలకు త్వరలో ఉద్దీపన ప్యాకేజీ
బంగారం కొనుగోలుదారులకు ఊరట.. ఎందుకంటే?!
బంగారం బుల్ రంకె.. నెలలోనే 7% పైపైకి?!
ఆటో కంపెనీల వారంటీ, ఫ్రీ సర్వీస్ పీరియడ్ పొడిగింపు!
గల్వాన్ సరిహద్దు ఘర్షణ వేళ.. డ్రాగన్కు ఆ ఎగుమతులు రెట్టింపు!!
డైమండ్ ట్రేడర్ నుంచి.. ఆసియా బిలియనీర్ వరకూ..!!
200 కోట్ల డోస్ల ఉత్పత్తికి వాక్హార్డ్ రెడీ.. కానీ?!