బంజారాహిల్స్ రోడ్ నం. 11లోని గౌరీశంకర్ కాలనీలో ఉంటున్న చందన్ దాస్ అనే వ్యక్తి ఓ ఆస్పత్రిలో క్యాంటీన్ సూపర్వైజర్గా పనిచేస్తుంటాడు. గతంలో సెల్ఫోన్ టవర్ల నిర్మాణ పనుల్లో అనుభవం ఉన్న చందన్దాస్ ఆన్లైన్లో పనుల కోసం గూగుల్లో వెతికాడు. బీఈఎస్ టెక్ పవర్ కంపెనీ అనే సంస్థలో పనులున్నాయని, దరఖాస్తు చేసుకోవాలని వచ్చింది. దీంతో రెండునెలల కిందట తన వివరాలను నమోదు చేశాడు. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్లోకి వచ్చిన ఓ వ్యక్తి అతడికి సంబంధించిన డాక్యుమెంట్స్ను తీసుకున్నాడు. డిపాజిట్ కింద రూ.28,499 కట్టాల్సి ఉంటుందని, గూగుల్ పే నంబర్ ఇచ్చాడు. ఆ మొత్తాన్ని చెల్లించగా, మరింత డబ్బు కావాలంటూ..వాట్సాప్లో కోరుతుండటంతో అనుమానం వచ్చి ఆరా తీయగా ,మోసమని తేలింది. దీంతో సైబర్ క్రైం పోర్టల్లో ఫిర్యాదు చేయగా డబ్బులు వెళ్లిన అకౌంట్ను ఫ్రీజ్ చేశారు. వారి సూచన మేరకు శనివారం రాత్రి స్థానిక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.