సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): చిలకలగూడకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి రుణం కోసం ఆన్లైన్లో ప్రయత్నిస్తుండగా ముద్ర ఫైనాన్స్ పేరుతో ఒక సంస్థ ఫోన్ నంబర్ కనిపించింది. ఆ నంబర్కు ఫోన్ చేయడంతో మీ వివరాలు వాట్సాప్లో పంపించమని, మీకు రూ.20 లక్షల వరకు రుణం వస్తుందంటూ నమ్మించారు. ఆ తరువాత మీకు రుణం మంజూరయ్యిందని, కొన్ని ఫీజులు, పన్నుతో పాటు అడ్వాన్స్గా ఈఎంఐల పేరుతో రూ.4.9 లక్షలు వసూలు చేశారు.
ఆన్లైన్లో పెట్టుబడి ప్రకటన చూసిన సికింద్రాబాద్ వాసి అందులో ఉన్న నంబర్కు ఫోన్ చేశాడు. తమ వద్ద డిపాజిట్ చేస్తే భారీ లాభాలొస్తాయంటూ నమ్మించారు. ముందుగా తక్కువ మొత్తంలో డిపాజిట్ చేయించి, వాటిని తిరిగి ఇచ్చేసి నమ్మకం పొందారు. తరువాత దఫదఫాలుగా రూ. 3 లక్షలు డిపాజిట్ చేయించి, లాభాలొస్తున్నాయంటూ నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు చేతులెత్తేయడంతో బాధితుడు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయా ఘటనలపై కేసులు దర్యాప్తు చేపట్టారు.