పీర్జాదిగూడ, జూలై 31: డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానని ఆశ చూపించి పలువురి వద్ద డబ్బులు దండుకుని మోసం చేసిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం ది. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని మౌలాలి హెచ్.బీ కాలనీలో నివాసం ఉంటున్న వి. శ్రీనివాసరావు కొన్నేండ్ల నుంచి పలువురికి డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇప్పిస్తానని, ఒక వేల ఇప్పియ్య కుంటే రెండు నెలలో తిరిగి మీ డబ్బులు వాపసు ఇస్తానని ప్రామ్సరీ నోట్ రాసిచ్చి నమ్మించాడు. బోడుప్పల్, మల్కా జిగిరి పరిసర ప్రాంతాలకు చెందిన 13 మంది నుంచి డబుల్ బెడ్రూంకు మీసేవలో చేసుకున్న దరఖాస్తులతో పాటు వారినుంచి సుమారు రూ.12,75000 లక్షలు తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా డబుల్ బెడ్రూం ఇండ్ల లిస్టులో పేరు రాకపోవడంతో పాటు తిరిగి డబ్బులు ఇస్తానన్న గడువు రావడంతో బాధితులు ఎన్ని సార్లు అడిగినా దాట వేస్తూ తప్పించుకుని తిరుగుతు న్నాడు. అనుమానం వచ్చిన బాధితులు శనివారం శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి చూడగా కనిపించ లేదు. మోసపో యామని గ్రహించిన బోడుప్పల్ భీంరెడ్డి కాలనీకి చెందిన బాధితురాలు శైలజ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని శ్రీనివాస్రావుని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.