బంజారాహిల్స్, జూలై 24: ఫార్మా సం స్థకు అవసరమయ్యే ముడి పదార్థాలను సరఫరా చేసిన నెల రోజుల్లో డబ్బులు ఇస్తామని నమ్మించి మోసం చేసిన ఓ ప్రైవే టు సంస్థ జనరల్ మేనేజర్తో పాటు డైరెక్టర్లపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల ప్రకారం, కమలాపురి కాలనీలోని ఇండియన్ క్యాష్ అండ్ క్యారీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను గుంటూరు జిల్లా పిడుగురాళ్ల (కమ్మరిపాలెం)లోని క్రో మోజీన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు గతేడాది సంప్రదించారు. త మ సంస్థకు అవసరమయ్యే కొన్ని రసాయనాలను సరఫరా చేయాలని, నెల రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని నమ్మించారు. దాం తో గతేడాది జూన్, ఆగస్టు నెలల్లో రూ.1. 20 కోట్ల విలువైన ముడి సరుకును ఇండియన్ క్యాష్ అండ్ క్యారీ సంస్థ సరఫరా చేసింది. అయితే, నెలలు గడిచినా డబ్బు లు చెల్లించకపోగా, క్రోమోజిన్ సంస్థ ఎండీ శివ కుమార్, డైరెక్టర్లు మేడమ్ హనుమంతరావు, ఆలేటి కనకయ్య, మేడమ్ వెంకటనాగ సురేష్ తదితరులు బెదిరింపులకు ది గారు. తప్పుడు కేసులు పెట్టిస్తామంటూ తమను బెదిరించడంతో పాటు మోసానికి పాల్పడ్డారని ఇండియన్ క్యాషన్ అండ్ క్యారీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జనరల్ మేనేజర్ రాంమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీ 420,406,506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.