బల్క్లో మాస్కులు కొనేందుకు ఇండియామార్ట్ వెబ్సైట్లోకి వెళ్లిన ఓ వ్యాపారి… సైబర్నేరగాడి చేతికి చిక్కి రూ. 1.15 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జ్ఞాన్బాగ్కాలనీకి చెందిన కపిల్జైన్ హోల్సేల్లో మాస్కులు కొనాలనుకొని ఇండియామార్ట్ వెబ్సైట్లోకి వెళ్లి పరిశీలించగా బెంగళూర్కు చెందిన సేఫ్కేర్ అనే సంస్థకు చెందిన అశోక్గౌత్ పరిచయం అయ్యాడు.. ధర మాట్లాడుకుని..ఒప్పందం చేసుకున్నారు. ముం దుగా డబ్బులు డిపాజిట్ చేస్తే రెండు రోజుల్లో మాస్కులు పంపిస్తామంటూ అతను సూచించగా రూ.1.15లక్షలు డిపాజిట్ చేశాడు. వారం రోజులైనా మాస్కులు రాకపోవడంతో సదరు వ్యక్తికి ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. మో సపోయానని గుర్తించిన వ్యాపారి శనివారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.