కాచిగూడ : చెడు వ్యసనాలకు బానిసలై రైల్వేస్టేషన్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువ కులను కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. మాణీకేశ్వరనగర్ ప్రాంతానికి బోసబోయిన సాయిరామ్ (19) కూలీ, తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన బెస్త శివ (22) టెంట్హౌస్లో పనిచేస్తాడు. సీతాఫల్మండీ ప్రాంతానికి చెందిన సండ్ర సాయిరాజ్(19) కూరగా యల అమ్మకందారు. రవింద్రనగర్ ప్రాంతానికి చెందిన నరదాస్ రాజు (20) లు వ్యసనాలకు అలవాటు పడ్డారు.
ఈ నలుగురు రాత్రిపూట రైల్వేస్టేషన్లలో ప్రయాణీకుల వద్ద డబ్బులు, సెల్ఫోన్లను దొంగలిస్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 11న కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్రయాణీకుల వద్ద మూడు సెల్ఫోన్లను లాక్కొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రైల్వేస్టేషన్లో తనిఖీలు చేస్తుండగా వారిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో ఈ నలుగురు చేసిన దొంగతనాలు ఒప్పుకున్నారు. వారి నుంచి 3 ఖరీదైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ బిజీ ప్రసాద్ తెలిపారు.