హైదరాబాద్ : అక్రమంగా నల్లా కనెక్షన్ పెట్టుకున్న ఇద్దరిపై అదేవిధంగా అధికారుల విధులకు అడ్డు వచ్చిన మరో ఇద్దరి వ్యక్తులపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, సివరేజీ బోర్డు విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. చింతల్బస్తీలోని ఏసీ గార్డ్స్లో ఉన్న అక్రమ నల్లా కనెక్షన్లను తీసేందుకు అధికారులు వెళ్లారు. కాగా అధికారులను ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. దీంతో మొత్తం నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.