నిన్నటివరకు దేశంలో వ్యాక్సిన్ల కొరత ఉంటే ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ల సమస్య వేధిస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకి లక్షల్లో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు హాస్పిటల్స్ లోనూ రోగుల సంఖ్య పెరుగుతోంది. దీంతో సరైన వైద్యం అందక కొందరు, ఆక్సిజన్ల కొరత కారణంగా ఇంకొందరు , సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మరికొందరు ప్రాణాలు విడుస్తున్నారు. అలా మధ్య ప్రదేశ్లో ఓ వార్డ్ బాయ్ తీరువల్ల ఓ కరోనా రోగి ప్రాణాలు కోల్పోవడం ఉద్రికత్తలకు దారితీసింది.
శివపురిజిల్లా హాస్పిటల్లో ఓ కోవిడ్ రోగి ప్రాణాలు కోల్పోవడానికి వార్డ్ బాయే కారణమని మృతులు బంధువులు ఆరోపిస్తున్నారు. డయాలిసిస్ రోగి మాత్రమే కాదు హిమోగ్లోబిన్ లెవల్స్ కూడా పడిపోయిన కోవిడ్ రోగికి ఆక్సిజన్ సాయంతో ట్రీట్ మెంట్ జరుగుతోంది. అయితే ఓ వార్డ్ బాయ్ ఆ రోగి ఆక్సిజన్ సపోర్ట్ తీసివేయడంతో ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ రోగి బంధువులు ఆందోళనకు దిగారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.