భారీ వర్షాలతో ఉస్మాన్సాగర్కు జలకళ
జలాశయానికి భారీగా చేరుతున్న వరదనీరు
ఉస్మాన్సాగర్ రెండు గేట్లు ఒక్క అడుగు మేర ఎత్తివేత
మూసీ నదిలోకి నీటి విడుదల
హైదరాబాద్ : గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్సాగర్(గండిపేట) జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటోంది. దీనికి తోడు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ఉస్మాన్సాగర్ రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని మూసీ నదిలోకి నీటిని వదిలారు. ఈ సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.