హైదరాబాద్ : నగర శివార్లలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్సాగర్లోకి 750 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్సాగర్లో 1762.1 అడుగులకు నీటిమట్టం చేరింది. గరిష్ఠ నీటిమట్టం 1763.5 అడుగులు. హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తి మూసీలోకి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఉస్మాన్ సాగర్లోకి 1200 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 1789.35 అడుగులు కాగా, గరిష్ఠ నీటిమట్టం 1790 అడుగులు. ఉస్మాన్ సాగర్ 4 గేట్లు ఎత్తి మూసీలోకి 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.