మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
గోదావరి నది వద్ద అభివృద్ధి పనుల పరిశీలన
సీసీసీ నస్పూర్, మే 27 : నస్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. నస్పూర్లో ఆయన గురువారం పర్యటించారు. మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగ తిరుపతితో కలిసి సీతారాంపల్లి గోదావరి పుష్కరఘాట్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇంకా చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతం ఎప్పుడు శుభ్రంగా ఉండేలా మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పాత పుష్కరఘాట్ను ఆనుకొని సీఎస్ఆర్ నిధులు రూ.10 లక్షల 20 వేలతో మరో పుష్కరఘాట్ నిర్మిస్తున్నామన్నారు. వర్షాకాలంలో గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుందని, ఈలోగా కిందిభాగంలో మెట్ల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నది పరీవాహక ప్రాంతంలో స్నానాల కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సీసీసీ కార్నర్ నుంచి గోదావరి నది వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతామన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనుల కోసం రూ. 7 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ సిస్టంతో మున్సిపాలిటీ కొత్త శోభను సంతరించుకోబోతుందన్నారు.
షాపింగ్ ఏరియా సందర్శన..
సీసీసీ కార్నర్ షాపింగ్ ఏరియాలో ఎమ్మెల్యే దివాకర్రావు పర్యటించారు. వ్యాపారులు, కొనుగోలుదారులతో మాట్లాడారు. మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కొవిడ్తో చనిపోయిన నిరుపేద మృతదేహాల తరలింపు కోసం మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభించామని గుర్తుచేశా రు. మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజు సోడియం హై పోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు. కౌన్సిలర్లు కుర్మిళ్ల అన్నపూర్ణ, చిడం మహే శ్, నాయకులు ఏనుగు రవీందర్రెడ్డి, హైమద్, అ క్కూరి సుబ్బయ్య, జక్కుల రాజేశం, పెరుమాళ్ల జ నార్దన్, మేరుగు పవన్కుమార్, కుర్మిళ్ల మోహన్, దగ్గుల మధు, కాటం రాజు, మున్సిపల్ సిబ్బంది పెద్దింటి మోహన్రావు, గోపి పాల్గొన్నారు.