హైదరాబాద్: నగర శివార్లలోని దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దూలపల్లి పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ గోదాంలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదాంమొత్తానికి విస్తరించాయి. దీంతో మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి. గోదాం పరిసరాల్లో పోగలు దట్టంగా అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ సహాయంతో మంటలు ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి