హైదరాబాద్ : నగరంలోని కూకట్పల్లిలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఏఈ ఎక్స్ప్రెస్ పార్కింగ్ యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పార్క్ చేసిన పలు ఆటోలు, బైక్లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.