కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 29 : వైద్యశాలల్లో అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా.. అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేందర్రావు అ న్నారు. వైద్యశాలల్లో తలెత్తే అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ గురువారం కూకట్పల్లి రాందేవ్రావు వైద్యశాలలో మాక్డ్రిల్ను నిర్వహించారు. మ హారాష్ట్రలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని మేడ్చల్ జిల్లా విపత్తు, నిర్వహణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో కూకట్పల్లి, శామీర్పేట, జీడిమెట్ల ఫైర్ స్టేషన్ల పరిధిలో కొవిడ్ వైద్యశాలల్లో అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా కూకట్పల్లి ఫైర్ స్టేషన్ పరిధిలోని 79 కొవిడ్ వైద్యశాలల మేనేజర్లు, సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో మాక్డ్రిల్ను నిర్వహించి.. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
గ్యాస్ సి లిండర్ మంటలను ఆర్పడం, అగ్ని ప్రమాదాలు తలెత్తినప్పుడు ఫైర్ ఇంజిన్తో చల్లార్చే విధానం, వైద్యశాలల్లో రోగులను, ఇతరులను జాగ్రత్తగా బయటికి తీసుకురావడం, శ్వాస సంబంధిత, అగ్ని ప్రమాదం జరిగిన వ్యక్తులకు అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్లు సతీశ్కుమార్, సైదులు, జీడిమెట్ల ఎస్ఎఫ్వో సుభాష్రెడ్డి, శామీర్పేట ఎస్ఎఫ్వో పూర్ణకుమార్, ఫైర్ సిబ్బంది రాందేవ్రావు వైద్యశాల ఎండీ కమలాకర్, సీఈవో యోబు, ఇతర వైద్యశాలల సిబ్బంది పాల్గొన్నారు.