శంషాబాద్ రూరల్, మే 30 : ఔటర్రింగ్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ ప్రకాశ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ ప్రాంతానికి చెందిన నరేశ్, వరలక్ష్మి దంపతులు ఆదివారం కారు (ఏపీ24 టీవీ 1565)లో హైదర్షాకోట్లో ఉన్న బంధువుల ఇంటికి బయలుదేరారు. శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ గ్రామ సమీపంలోకి రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన నరేశ్ వెంటనే.. కారును ఆపి కిందకు దిగారు. అనంతరం ఫైర్స్టేషన్కు సమాచారం అందజేశారు. ఫైర్ సిబ్బంది, పో లీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే కారు పూర్తిగా కాలిబుడిదైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.