41,305 వేల ఇండ్లలో పరిశీలన
బుధవారం ఒక్కరోజే 707 బృందాలతో శోధన
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు కొవిడ్ నియంత్రణలో భాగంగా మూడో రోజైన బుధవారం ఇంటింటికీ తిరిగి జ్వరం, కొవిడ్ లక్షణాలున్న వారి సర్వే చేపట్టారు. 707 బృందాలు సర్వేలో ప్రధానంగా పాల్గొన్నారు. ఒక్కో బృందంలో ఒక ఏఎంఎం, ఆశా వర్కర్, జీహెచ్ఎంసీ ఎంటమాలజీ వర్కర్తో కూడిన సభ్యులు ఇంటింటికీ తిరిగి ధర్మోస్కానర్తో 41,305 ఇండ్లలో ఫీవర్ సర్వే చేపట్టారు. ఈ బృందాలు జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. సోమవారం 393 మందితో ప్రారంభమైన సర్వే మంగళవారం 641 బృందాలు, బుధవారం 707 బృందాలతో సర్వే ప్రక్రియలో వేగం పెంచారు. ప్రతి బస్తీ దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దవాఖానాలో కొవిడ్ ఔట్ పేషెంట్ల పరీక్ష లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అన్ని ఆసుపత్రులలో 19,090 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు.