మాదాపూర్, ఆగస్టు 15: మాదాపూర్లోని హెచ్ఐసీసీలో సూత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఆదివారం సినీనటి శ్రీజిత గోష్, ప్రముఖ మోడల్స్, నిర్వాహకులు మోనిక మద్యాన్, ఉమేశ్ మద్యాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దేశ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన ప్రముఖ డిజైనర్లచే రూపొందించిన వస్తు, ఉత్పత్తులను ప్రదర్శించారు. అనంతరం ఎగ్జిబిషన్కు విచ్చేసిన మోడల్స్ ర్యాంప్వాక్ చేస్తూ ఆకట్టుకున్నారు. సినీనటి శ్రీజిత గోష్తో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.