సిటీబ్యూరో, జూన్ 18(నమస్తే తెలంగాణ): చైనా దేశానికి చెందిన పవర్ బ్యాంక్ మోసాలు వెలుగులోకి వచ్చా యి. ఇటీవల రూ. 300 పెట్టుబడి పెడితే గంటకు అదనంగా రూ.450 ఇస్తామంటూ నమ్మించి చిన్న మొత్తాల లో పెట్టుబడులు పెట్టించి, ఆన్లైన్ మల్టీలెవల్ మార్కెటిం గ్ మాదిరిగా మోసాలు చేశారంటూ కొందరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేవలం హైదరాబాద్లోనే ఇలాంటి బాధితులు 150 నుంచి 200 మందికి పైగా ఉండగా.. రూ. 20లక్షల వరకు పెట్టుడులు పెట్టి మోసపోయారు. అందులో కొంద రు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదయ్యాయి. ఇలాంటి కేసులు ముంబాయి, బెంగళూరు, డెహ్రాడూన్, ఢిల్లీ, నోయాడా ప్రాంతాలలో నూ నమోదయ్యాయి.
ఈ కేసులో ఉత్తరాఖండ్ పోలీసులు ఈ నెల 9న సూత్రదారి అయిన నోయిడాకు చెందిన పవన్కుమా ర్ పాండ్యతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అదే తరహాలో ఢిల్లీ పోలీసులు 11 మందిని పట్టుకున్నారు. ఈ ముఠాల ను విచారించడంతో సూత్రదారులంతా చైనాలో ఉన్నారని, బీజింగ్, హాంకాంగ్ల నుంచి ఇదంతా నడుపుతున్నారని వెల్లడించారు. పవర్ బ్యాంక్ యాప్ పేరుతో గూగుల్ ప్లే స్టోర్స్లో అందుబాటు లో పెట్టి దేశ వ్యాప్తంగా లక్షలాది మందిని మోసం చేసి రూ.350 కోట్లకుపైగానే స్వాహా చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. దీంతో చైనా సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసం ఆయా రాష్ర్టాల సైబర్క్రైమ్ పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ, జార్ఖండ్ పోలీసుల కు పట్టుబడిన వారిని పీటీ వారెంట్పై తీసుకొచ్చేందుకు నగర సైబర్క్రైమ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.