షేర్మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంటూ నమ్మించి ఓ వ్యాపారికి సైబర్నేరగాళ్లు లక్ష రూపాయలు టోకరా వేశారు. గౌలిపురాకు చెందిన అరుణ్కు ఫేస్బుక్లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తాము షేర్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు సంపాదిస్తున్నాం. మీ వద్ద డబ్బులుంటే పెట్టుబడులు పెట్టండంటూ సూచించాడు. కొన్నాళ్లకు వాళ్లు చెప్పిన మాటలు విన్న అరుణ్ రూ.లక్ష వారి ఖాతాలోకి బదిలీ చేశాడు. వారం రోజుల్లో లక్షకు లక్ష లాభం వచ్చినట్లుగా, స్క్రీన్ షాట్లు తీసి బాధితుడికి వాట్సాప్లో పంపించారు. ఇదంతా నాలుగు నెలల కిందట జరిగింది. అప్పటి నుంచి డబ్బు పంపిస్తామంటూ నమ్మిస్తూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఇటీవల వారి ఫోన్లు కూడా స్విచాఫ్ రావడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.