ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకొని బాలికను వేధిస్తున్న ఓ యువకుడిపై పేట్ బషీరాబాద్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారానికి చెందిన రాహుల్ (19), సుచిత్రకు చెందిన ఓ బాలికకు మధ్య ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ చనువుతోనే బాలికను తన గ్రామానికి తీసుకెళ్లిన రాహుల్ వ్యక్తిగత ఫొటోలను ఫోన్లో తీసుకున్నాడు. అనంతరం బాలికను వేధించడం మొదలు పెట్టాడు. డబ్బులు డిమాండ్ చేసి రూ. 57 వేలు వసూలు చేశారు. ఈ నెల 3న బాలిక తండ్రికి ఫోన్ చేసి ‘మీ కూతురు ఫొటోలు నా దగ్గర ఉన్నాయి.. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడుతానని’ బెదిరించాడు. దీంతో బాలిక తండ్రి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి రాహుల్ను రిమాండ్కు తరలించారు.