కెనడాలో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన సైబర్నేరగాళ్లు.. ఓ యువకుడికి రూ.14లక్షలు టోకరా వేశా రు. సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులలు తెలి పిన వివరాల ప్రకా రం.. బోయిగూడకు చెందిన వినయ్కుమార్ హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాడు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో ఫేస్బుక్లో జేమ్స్ అనే పేరుతో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. మీ చదువుకు తగ్గ ఉద్యోగం కెనడాలో ఇప్పిస్తానని నమ్మించాడు. అయితే.. ఫలానావారిని సంప్రదించండి..వారు సహాయం చేస్తారని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చాడు.
వెంటనే వినయ్కుమార్ ఆ ఫోన్లో సంప్రదించగా కెనడాలో ఉద్యోగం సిద్ధంగా ఉంద ని, అయి తే… ముందుగా మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆ తరువాత వీసా ప్రాసెసింగ్ చేస్తామంటూ నమ్మిస్తూ దఫ దఫాలుగా అతడి నుంచి రూ.14లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బు అడుగుతుండటంతో మోసమని గుర్తించిన బాధితుడు వినయ్ కుమార్ గురువారం సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ నేతృత్వంలోని దర్యాప్తు చేపట్టారు.