బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ సినీ ప్రేక్షకులకు చాలా సుపరిచితం. ఆయన తెరకెక్కించిన తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, రాంజానా, శుభ్ మంగల్ జ్యాధా సవావధాన్, తుంబాద్, లాల్ కష్టాన్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా ఓ చిత్రం, ధనుష్- అక్షయ్ కాంబినేషన్లో అత్రాంగిరే, జాన్వీ ప్రధాన పాత్రలో గుడ్ లక్ జెర్రీ, రక్షా బంధన్ అనే చిత్రాలని తెరకెక్కిస్తున్నారు.
మంచి ఫాంలో ఉన్న ఆనంద్ ఎల్ రాయ్ ముంబైలో ముంబైలో 25.3 కోట్లతో కళ్లు చెదిరే డూప్లెక్స్ ని సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఇల్లు సన్నీ లియోన్ డూప్లెక్స్ కి సమీపంలో ఉంది. 5761 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇల్లు ఐదు కార్ పార్కింగ్ స్లాట్ లను కలిగి ఉంది. ఈ ఇంటి కోసం మార్చి 8 న రూ. 75.9 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారట. తన భార్యతో యోగితతో కలిసి ఈ ప్రాజెక్ట్లో 25.3 కోట్లు పెట్టుబడి పెట్టారని అంటున్నారు.