మేడ్చల్, ఏప్రిల్ 15 : పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన సుజాతకు సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరైన రూ.30 వేల చెక్కును గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారురాలి కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నదన్నారు. వైద్య ఖర్చులు భరించలేని పేదలకు సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా ఆదుకుంటున్నారన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఉమానాగరాజు, శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు శేఖర్గౌడ్, నాయకులు నర్సింహారెడ్డి, శ్రవణ్కుమార్, మోహన్రెడ్డి, రవీందర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.