కాచిగూడ,ఆగస్టు 24 : ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం బర్కత్పురలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ఆరాధనోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు, కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవి, దిడ్డి రాంబాబు ఆలయానికి విచ్చేసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాఘవేంద్రస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం బర్కత్పుర రాఘవేంద్రస్వామి మఠం మేనేజర్ పురణిక్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ ఉమాదేవి,దిడ్డి రాంబాబును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మాజీ ప్లోర్లీడర్ దిడ్డి రాంబాబు, కన్నె రమేశ్యాదవ్, దాత్రిక్ నాగేందర్బాబ్జి, బి.కృష్ణాగౌడ్, బండారు సంతోశ్కుమార్, సుభాశ్పటేల్, క్షీర్సాగర్, మల్లికార్జున్, భీంరాజ్, తదితరులు పాల్గొన్నారు.