మారేడ్పల్లి, ఆగస్టు 30 : ప్రతి ఒక్కరు అశ్రద్ద వహించకుండా టీకా వేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. సోమవారం మోండా డివిజన్ రైల్ నిలయం అంబేద్కర్నగర్ బస్తీలో నిర్వహించిన ఉచిత కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఎమ్మెల్యే జి. సాయన్న, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కంటోన్మెంట్లోని బస్తీ, కాలనీల్లో నివాసం ఉంటే ప్రతి ఒక్కరూ ముప్పు నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు.
ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని సూచించారు. కంటోన్మెంట్లో అన్ని బస్తీ, కాలనీల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. స్థానికంగా ఏవరైనా టీకా వేసుకొని వారు ఉంటే వెంటనే స్థానికంగా ఉన్న మొబైల్ కేంద్రాల వద్ద టీకాను వేసుకోవాలని చేప్పారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు నారాయణ, రాము, ఏసురత్నం, రౌతు రాజయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.