హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు. సోమవారం అంబర్పేటలోని కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో హరితహరంలో భాగంగా పోలీసుశాఖ ఏర్పాటు చేసిన కార్యాక్రమానికి నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్, అడిషనల్ కమిషనర్ చౌహాన్, డీపీపీ రమేష్, అడిషనల్ డీసీపీ మురళీధర్, స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్ తదితరులతో కలసి ఆయన హాజరైమొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం వాతావరణ సమతుల్యతను కాపాడుతోందని అన్నారు. తమ వంతు బాధ్యతగా పోలీసులు కూడా మొక్కలు నాటుతున్నారని తెలిపారు. మొక్కల పెంపకంతో నేడు పోలీసు స్టేషన్లు ఆకుపచ్చని వనాల్లా మారుతున్నాయన్నాయని ప్రశంసించారు. సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ…ఒకప్పడు పోలీస్ స్టేషన్లు అంటే కొందరికి అభద్రతా భావం కలిగి ఉండేదని నేడు పరిస్థితి పూర్తిగా మారిందన్నారు.
పోలీస్ స్టేషన్లు పచ్చని అందాలతో ఆహ్లదకర వాతావరణానికి నిలయాలకు మారుతున్నాయని అన్నారు. ఇందుకు ఆయా పోలీస్స్టేషన్లో రకరకాల మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్న పోలీసులను ఆయన అభినందించారు.
కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ అనిల్కుమార్, ఏసీపీ శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు విజయ్కుమార్, తులసీధర్చ శ్రీనివాస్రావు, ఇన్స్పెక్టర్లు పేరం సుధాకర్, శ్రీనివాస్తో పాటు పలువరు అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
మోదీజీ పుట్టగొడుగులు మానేసి ఐదు రోజులు ఈ ఆహారం తీసుకోండి!
ఆధ్మాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం : మంత్రి ఐకే రెడ్డి
సమాజానికి దారి చూపే రచనలు రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్