బంజారాహిల్స్,ఆగస్టు 23 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫిలింనగర్లోని రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో సమర్థన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూ.3లక్షల వ్యయంతో డిజిటల్ క్లాస్రూమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
డిజిటల్ పాఠాలను విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆడియో విజువల్స్, అసైన్మెంట్స్, ఎక్సపర్మెంట్స్తో పాటు పాఠ్యాంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ ప్రతినిధులు చంపక, టీ. రాఘవ్రావు తెలిపారు.