ఆలేరురూరల్, ఏప్రిల్19: పల్లె ప్రగతి ఓ బృహత్తర కార్యక్ర మం..దశాబ్దాల సమస్యలు.. వ్యథలకు చమరగీతం పాడే పాశు పతాస్త్రం. ప్రారంభమైన ఏడాదిలోనే పల్లెలకు కొత్త అందాలు తీసుకొచ్చింది. పల్లె ప్రగతి పథకం పరుగులు తీస్తున్న ప్రగతి రథం కానీ ఆలేరు మండలం గోలనుకొండ గ్రామంలో మా త్రం అభివృద్ధి వెనుకబడిపోయింది. మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా చేపట్టిన పనులు కళావిహీనంగా మారుతున్నాయి. స్థానిక పాలకవర్గం నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన సెగ్రీగె షన్షెడ్(డంపింగ్ యార్డు) నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తడి, పొడి చెత్త ను వేరు చేయకుండా సెగ్రీగెషన్షెడ్ ఎ దుటే విచ్చలవిడిగా పారేస్తున్నారు. గ్రా మంలో వైకుంఠధామం నిర్మాణం కో సం రూ.12లక్షలు వెచ్చించారు. పను లు మాత్రం పిల్లర్లకే పరిమి తమయ్యా యి. మరుగుదొడ్లకు రింగులు వేయలే దు. పైపైనే పైపులు వేసి చేతులు దులుపు కున్నారు. ప్రభుత్వం పుష్కలంగా నిధు లు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి పనులు నత్తనడకన నడుస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాల ని కోరుతున్నారు.
దగ్గరుండి పనులు చేయిస్తాం
గోలనుకొండలో అసంపూర్తిగా నిలిచి పోయిన పనులు త్వరగా పూర్తయ్యే లా చర్యలు చేపడుతాం. గ్రామంలో పారిశుధ్య పనులపై నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తే సహించం. వారానికి రెండు సార్లు గ్రామంలో పర్యటించి పనులను పరిశీలిస్తున్నాం. పం చాయతీ సిబ్బందితో సమావేశాలు నిర్వహించి పనులు త్వరి తగతిన పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం. అయిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం.
– ఎంపీడీవో జ్ఞానప్రకాశ్రావు, ఆలేరు మండలం
ఇవీ కూడా చదవండి…
అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి