పుణే : మహారాష్ట్రలోని పుణే నగరంలో కొవిడ్ వ్యాక్సిన్ల కొరత నెలకొంది. దీంతో నేడు నగరవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేస్తున్నట్లు మేయర్ మురళీధర్ మొహోల్ తెలిపారు. ప్రజలెవరూ వ్యాక్సిన్ కోసం పంపణీ కేంద్రాల వద్దకు రావద్దని విజ్ఞప్తి చేశారు. పుణే మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 300 మ్యూకోర్ మైకోసిస్ కేసులున్నాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ శుక్రవారం తెలిపారు.
ఇంజక్షన్ల కొరత కారణంగా వారికి బ్లాక్ ఫంగస్ ప్రమాదం పొంచి ఉందని ఆయన మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 3.85 లక్షల కొవిడ్ పాజిటివ్ కేసులున్నాయి. 10,728 మంది వైరస్ బారినపడి మృతి చెందారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.