బంజారాహిల్స్,ఆగస్టు 22 : అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ వేడుకలు ఆదివారం ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా మహిళలు, యువతులు, చిన్నారులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల నివాసాల వద్ద సందడి నెలకొంది.
తమ అభిమాననేతలకు రాఖీలు కట్టేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ క్యాంపు కార్యాలయాల వద్ద పండుగ వాతావారణం నెలకొంది. పలువురు మహిళా కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకురాళ్లు. కార్యకర్తలు వచ్చి వారికి రాఖీలు కట్టారు.