నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 5 :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతితో కామారెడ్డి జిల్లా నాగి రెడ్డిపేట్ మండలం మేజర్ వాడీ గ్రామం మెరిసిపోతున్నది. ఉమ్మడి జీపీగా ఉన్న గ్రామం రెండుగా విడిపోయి చిన్న గ్రామంగా ఏర్పడింది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతో చిన్నగ్రామమైనా అద్భుతమై న ప్రగతితో ముందుకు సాగుతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో వైకుంఠధామం, ప్రకృతివపనం, డంపింగ్యార్డు, కోతుల ఆహారశాల, అవెన్యూ ప్లాంటేషన్ పనులన్నీ పూర్తి చేసుకొని ఇతర గ్రామాలతో అభివృద్ధిలో పోటీ పడుతున్నది. పనులన్నీ స్వల్పకాలంలోనే పూర్తి చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. గ్రామంలో 1149 మంది జనాభా ఉన్నారు. అభివృద్ధి పనులు విస్తృతంగా చేపడుతుండడంతో గ్రామంలో వంద శాతం పన్నులు వసూలు అవుతున్నాయి. ప్రతిరోజూ చెత్త సేకరించడానికి ఒక ట్రాక్టర్ కొనుగోలు చేశారు. తడి,పొడి చెత్త వేరు చేసి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కంపోస్టు షెడ్డుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రం చేయడంతో పాటు చెత్త సేకరించడం , బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో గ్రామంలో వ్యాధులు ప్రబలడం తగ్గిపోయింది.
అందరి సహకారంతో అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం గ్రా మంలో ప్రారంభించి న పల్లె ప్రగతి పనుల న్నీ గ్రామస్తుల సహకారంతో పూర్తి చేశాం. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తు న్నాం. గ్రామంలో ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాం.
-అనూష, సర్పంచ్