చార్మినార్, ఆగస్ట్ 12 : గజరాజుల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూ పార్క్లో పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. జూలోని ఏనుగులతో ఈ సందర్భంగా రాగి, బియ్యంతో తయారు చేసిన కేక్లను కట్ చేయించిన జూ అధికారులు ఘనంగా ఏనుగుల దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ప్రస్తుతం జూలో ఓ మగ ఏనుగుతోపాటు మరో 3 ఆడ ఏనుగులు సందర్శకులను అలరిస్తున్నాయని జూ పార్క్ క్యూరేటర్ సుభద్రదేవి తెలిపారు. జూలోని ఏనుగులు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రతి రోజు వాటి సంరక్షణ కోసం జూ సిబ్బంది సమయాలనుకూలంగా ఆహారాన్ని అందిస్తూ పోషిస్తున్నారని పేర్కొన్నారు.