చెన్నై: తమిళనాడు నూతన అసెంబ్లీ ఈ నెల 11న కొలువుదీరనుంది. మే 11న చెన్నైలోని కళైవనార్ అరంగంలో తమిళనాడు 16వ అసెంబ్లీ తొలి సెషన్ ప్రారంభం కానున్నదని అసెంబ్లీ సెక్రెటేరియట్ వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన చేసింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా అదే రోజు ప్రమాణస్వీకారం చేస్తారని ఆ ప్రకటనలో వెల్లడించారు. ఆ తర్వాత రోజు అంటే మే 12న తమిళనాడు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుందని తెలిపారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకుగాను డీఎంకే 160 స్థానాల్లో విజయం సాధించింది. దాంతో ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. శుక్రవారం ఉదయం స్టాలిన్ ముఖ్యమంత్రిగా, మరో 33 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకుంటూనే ఇంటికి నాలుగు వేల కరోనా సాయం ఫైలుపై తొలి సంతకం చేశారు.