హిమాయత్నగర్,ఆగస్టు13 : తెలుగు బీసీ ప్రజా సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. శుక్రవారం హిమాయత్నగర్లో జరిగిన సంఘం సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా జె.శ్రీధర్, ఉపాధ్యక్షుడిగా పుట్ట యాదగిరి, ప్రధాన కార్యదర్శి డి.రాజశేఖర్, కోషాధికారిగా పాతకోటి మహేష్, ప్రచార కార్యదర్శి వేణు గోపాల చారి, కార్యదర్శులుగా సి.నాగేంద్రచారి, భాస్కర్గౌడ్ ఎన్నికయ్యారు.
అలాగే కార్యవర్గ సభ్యులుగా నరేందర్, జె.మల్లే శ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన బీసీ కులాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తా మని తెలిపారు. బీసీ ఫెడరేషన్లకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి, పాలకమండలిని ఏర్పా టు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.