టెస్కాబ్ వైస్ చైర్మన్, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి
పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
యాదాద్రి, జూన్9: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమం త్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని టెస్కాబ్ వైస్ చైర్మన్, ఎన్డీ సీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. వివిధ అనారో గ్య కారణాలతో వైద్యం పొందిన యాదగిరిగుట్ట మండలంలో ని వంగపల్లికి చెందిన ఇంగువ గిరిజకు రూ. 60వేలు, కొలిపా క ఉపేందర్కు రూ. 45 వేలు, పెద్ద కందుకూరుకు చెందిన సీ సా విజయలక్ష్మికి రూ. 40వేలు, యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన చెరుకు బుచ్చమ్మకు రూ. 60 వేలు, మల్లాపురానికి చెందిన చల్లూరు కరుణాకర్కు రూ. 45వేలు, ధర్మారెడ్డి గూడెం కు చెందిన పాకాల సరితకు రూ. 40వేలు, చొల్లేరుకు చెందిన మీ సాల సత్తమ్మకు రూ.60వేలు, వడ్లకొండ స్వామికి రూ. 32 వేలు, వగ్గు ఆంజనేయులుకు రూ.42,500 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరు కాగా బుధవారం యాదగిరి గుట్ట పట్టణంలో ఆయన నివాసంలో అందజేశారు. కార్యక్ర మంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, జడ్పీ టీసీ తోటకూరి అనురాధ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రేపాక స్వామి, వంగపల్లి ఎంపీటీసీ రేపాక మౌనిక, సైదాపురం టీఆర్ ఎస్ గ్రామాధ్యక్షుడు తోటకూరి మల్లేశ్, భాస్కర్ పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
యాదగిరిగుట్ట రూరల్: ఇటీవల మరణించిన ప్రీమియర్ పరి శ్రమ కార్మికులు చందా రవి, గుర్రం రామచంద్రయ్య కుటుం బాలను డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి బుధవారం పెద్దకందుకూరులో పరామర్శించారు. టీఆర్ఎస్కేవీ ప్రధాన కార్యదర్శి ఎలక్షన్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహులు, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
వాటర్ ఫిల్టర్ల ఏర్పాటు అభినందనీయం
రాజాపేట: టీఆర్ఎస్ నేత ఠాకూర్ ప్రమోద్సింగ్ ప్రభుత్వ కార్యాలయల్లో వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేయడం అభినంద నీయమని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జాలకు చెందిన ఠాకూర్ శివచరణ్ సింగ్ జ్ఞాపకార్థం వారి కుమారులు ఎంపీడీవో, ప్రభుత్వ దవా ఖానల్లో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ఫిల్టర్లను ప్రారంభిం చారు. అనంతరం జాలలో ప్రమోద్ సింగ్ను పరామర్శిం చారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీంద ర్గౌడ్, జడ్పీటీసీ గోపాల్గౌడ్, టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు రాజిరెడ్డి, ఎంపీడీవో రామరాజు, డా.శివవర్మ, మదర్డెయిరీ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, సీసీబ్యాంక్ చైర్మన్ భాస్కర్రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు లక్ష్మణ్, సర్పంచ్లు శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, ధర్మేందర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
ఆలేరు టౌన్: ఆలేరు పట్టణంలో నివాసం ఉంటున్న సాయి కిరణ్కు సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ. లక్షా 50 వేల చెక్కును మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, కౌన్సిలర్లు బేతి రాములు, నాయకులు పంతం కృ ష్ణ, బరిగె నర్సింహులు, రామచంద్రారెడ్డి, వెంకటస్వామి, శం కరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) మండలంలో
ఆత్మకూరు(ఎం), జూన్9: మండల కేంద్రానికి చెందిన కొం డపల్లి యాదమ్మకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.27వేల చెక్కును బుధవారం ఎంపీటీసీ యాస కవిత ఆమె కు అందజేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కోరె వెంకన్న, బీసీసెల్, యువజన విభాగం, మైనార్టీసెల్ మం డలాధ్యక్షుడు తవిటి వెంకటేశ్వర్లు, బూడిద శేఖర్, ఎండీ.అజీ మొద్దిన్, టీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, బుచ్చ య్య, రాజు, సతీష్, అబ్బసాయిలు, మల్లేశం పాల్గొన్నారు.
బొమ్మలరామారంలో
బొమ్మలరామారం:సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం మని ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి అన్నారు. మండలంలోని ప్యారారంకు చెందిన కలకుంట్ల మల్లేశ్ ఆనారోగ్యంతో ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందాడు.అతడికి ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.42,500 చెక్కును బుధవారం లబ్ధిదా రుకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చిమ్ముల రవీంద ర్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు నర్సింహులు, వెంకటేశ్, మ ల్లేశ్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.